Saturday, April 27, 2024

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

వికారాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన ప్రజల నుండి వారి సమస్యలపై 276 ఫిర్యాదులను అదనపు కలెక్టర్ స్వీకరించారు.

వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ కృష్ణన్, డిపిఓ తరుణ్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News