Sunday, April 28, 2024

ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా అదనపు కలెక్టర్ గరీయా ఆగర్వాల్

సిద్దిపేట: ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వర గా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరీయా ఆగర్వాల్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నిర్వహించారు. దరఖాస్తులను స్వీకరించివారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను పిలిచి దరఖాస్తులను అందజేసి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా సేకరించిన ధరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించి నివేదికలను కలెక్టరేట్‌కు అందజేయాలని అదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్‌రూమ్‌లు, తదితర సమస్యలపై 31 దరఖాస్తులు వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News