Friday, April 26, 2024

తొలిరోజు ‘పుష్ప’కు రికార్డు కలెక్షన్లు..

- Advertisement -
- Advertisement -

Pushpa Collected Rs 71 cr gross on first day

హైదరాబాద్: ‘పుష్పః ది రైజ్’ చిత్రం ఘన విజయం దిశగా పయనిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నామని అన్నారు చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్. ఈ సందర్భంగా వారు హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్‌తో ‘పుష్ప’కు ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారు. ‘పుష్ప: ది రైజ్’ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇది 2021లో ఇండియాలోనే తొలి రోజు అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. అలాగే నైజాం ఏరియాలో దాదాపు 11.5 కోట్లు షేర్ వసూలు చేసి… ఆ ఏరియాలో తొలిరోజున అత్యధిక వసూళ్లు రాబట్ట్టిన సినిమాగా ‘పుష్ప ది రైజ్’ సరికొత్త రికార్డు అందుకుంది”అని అన్నారు.

Pushpa Collected Rs 71 cr gross on first day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News