Tuesday, May 14, 2024

వెన్ను నొప్పి వల్ల యుద్ధవీరుల స్మారకానికి హాజరుకాని బ్రిటన్ రాణి

- Advertisement -
- Advertisement -

Queen Elizabeth misses Remembrance Sunday service

లండన్: వెన్నునొప్పితో బాధపడుతున్న రాణీ ఎలిజెబెత్2 ఆదివారం సెంట్రల్ లండన్‌లో యుద్ధవీరుల స్మారక కార్యక్రమానికి హాజరు కావడంలేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం పట్ల రాజకుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నదని పేర్కొన్నది. వైద్యుల సలహామేరకే ఎలిజెబెత్2 ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. గత నెలలో అనారోగ్యానికి గురైన 95 ఏళ్ల ఎలిజెబెత్2 లండన్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందారు. రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకుంటానని అక్టోబర్ 29న వెల్లడించారు. గ్లాస్గోలో జరుగుతున్న ప్రపంచ పర్యావరణ సదస్సుకు హాజరు కాలేకపోయారు. అయితే, ఆమె తన వీడియో సందేశాన్ని అక్కడికి పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News