Wednesday, May 15, 2024

సీనియర్ స్టార్‌కు జోడీగా…

- Advertisement -
- Advertisement -

Raai Laxmi

నందమూరి బాలకృష్ణ -, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, – ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్న గోపీచంద్ మలినేని.. బాలయ్య కోసం వాస్తవ సంఘటన ఆధారంగా ఓ పవర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు ఇందులో ఇద్దరు హీరోయిన్లకు చోటు కల్పించారని టాక్ నడుస్తోంది. గోపీచంద్ మలినేని గత చిత్రాల్లో చూసుకుంటే ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘క్రాక్’ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్‌తో పాటుగా వరలక్ష్మీ శరత్ కుమార్‌కి కూడా జయమ్మ అనే గుర్తుండి పోయే రోల్ ఇచ్చాడు.

ఈ క్రమంలో నెక్స్ సినిమాలో బాలయ్యతో ఇద్దరు ముద్దుగుమ్మలు రొమాన్స్ చేస్తారని అంటున్నారు. అందులో ఒక హీరోయిన్‌గా రాయ్ లక్ష్మీని తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. గతంలో బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ చిత్రంలో లక్ష్మీ రాయ్ హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ‘అఖండ’ సినిమాలో రాయ్ లక్ష్మీతో ఓ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉందట. అలాగే గోపీచంద్ మలినేనితో చేసే సినిమాలో ఒక హీరోయిన్ గా తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే బాలయ్య సినిమా కోసం గోపీచంద్ ఇప్పుడు వేటపాలెంలోని 100 ఏళ్ల క్రితం నాటి పురాతనమైన లైబ్రరీలో పాత వార్తాపత్రికలతో పరిశోధన చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, – వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలకృష్ణ ‘అఖండ’ షూటింగ్ పూర్తయిన వెంటనే గోపీచంద్ ఈ సినిమా ప్రారంభిస్తాడని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News