- Advertisement -
న్యూఢిల్లీ: మహిళలపై నానాటికి నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బిజెపిపై విమర్శలు గుప్పించారు. ఉత్తర్ ప్రదేశ్ లో మహిళను వేధించిన నిందితుడిని బిజెపి ఎంఎల్ఎ, ఆయన కొడుకు కస్టడీ నుంచి తప్పించారని ఆరోపించారు. దీనిపై వచ్చిన వార్త కథనాలను ట్వీట్టర్ లో పోస్టు చేశారు. ఈ మేరకు మహిళల రక్షణ బచావో ప్రారంభమై.. అపారాధి బచావో సాగుతోందని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ఘటన భేటి బచావో మిషన్ కింద జరిగిందా.. లేదా అపరాధి బచావో మిషన్ కింద జరిగిందా.. అనే అంశాన్ని యుపి సిఎం చెప్పగలరా అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
- Advertisement -