అమరావతి: ఎపి ప్రభుత్వం 56 బిసి కార్పొరేషన్ల పాలకమండళ్లను ఆదివారం ప్రకటించింది. బిసి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పేర్లును తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బిసి కులాలకు గాను ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీటిలో ఒక్కో కార్పొరేషన్కు చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లను నియమించింది. ఇందులో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కాగా, ఛైర్మెన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించారు. బిసి కార్పొరేషన్లతో 728 మందికి పదవులు వరించాయి. 56 మంది ఛైర్ పరసన్లకు, 672 మంది రైరెక్టర్లకు పదవులు దక్కాయి. రాష్ట్ర చరిత్రలో ఇదో చారిత్రక సందర్భమని, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్ససత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్ నారాయణ, ఎంపి మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు
బిసి కార్పొరేషన్ ఛైర్మన్లు వీరే…
- కురుబ: కోటి సూర్యప్రకాశ్ బాబు (అనంతపురం)
- తొగట కార్పొరేషన్: గడ్డం సునీత (అనంతపురం)
- కుంచిటి వక్కలిగ: డా. నళిని (అనంతపురం)
- వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు)
- పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు)
- ముదళియర్: తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు)
- ఈడిగ: కె. శాంతి (చిత్తూరు)
- గాండ్ల: భవాణీప్రియ (తూ.గో)
- పెరిక: పురుషోత్తం గంగాభవానీ (తూ.గో)
- అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూ.గో)
- అయ్యారక: రాజేశ్వరం (తూ.గో)
- షేక్:షేక్ యాసీన్ (గుంటూరు)
- వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు)
- కుమ్మరి శాలివాహన: పురుషోత్తం (గుంటూరు)
- కృష్ణ బలిజ/పూసల: కోలా భవాణీ (గుంటూరు)
- యాదవ: హరీష్కుమార్ (కడప)
- నాయీబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప)
- పద్మశాలి: విజయలక్ష్మి (కడప)
- నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్ బి (కడప)
- సాగర ఉప్పర: గనుగపేట రమణమ్మ (కడప)
- విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా)
- గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)
- వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా)
- భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా)
- వాల్మీకి బోయ: డా. మధుసూదన్ (కర్నూలు)
- కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు)
- వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు)
- ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు)
- జంగం: ప్రసన్న (నెల్లూరు)
- బొందిలి: కిషోర్ సింగ్ (నెల్లూరు)
- ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు)
- చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్కుమార్ (ప్రకాశం)
- ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి (ప్రకాశం)
- దేవాంగ: సురేంద్రబాబు (ప్రకాశం)
- మేదర: లలిత నాంచారమ్మ (ప్రకాశం)
- కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం)
- కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం)
- రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం)
- పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం)
- కురకుల/పొండర: రాజపు హైమావతి (శ్రీకాకుళం)
- శ్రీసైన: చీపురు రాణి ( శ్రీకాకుళం)
- మత్స్యకార: కోలా గురువులు (విశాఖ)
- గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ)
- నగరాల: పిల్లా సుజాత (విశాఖ)
- యాత: పి.సుజాత (విశాఖ)
- నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)
- తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం)
- కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు (విజయనగరం)
- శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం)
- దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం)
- సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో)
- శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో)
- అత్యంత వెనుకబడిన వర్గాలు: వీరన్న (ప.గో)
- అతిరస: ఎల్లా భాస్కర్రావు (ప.గో)