Friday, April 26, 2024

రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించండి!

- Advertisement -
- Advertisement -

కేంద్రానికి విజ్ఞప్తి చేసిన టిఆర్‌ఎస్ ఎంపి రంజిత్‌రెడ్డి

Railway under bridge construct in Vikarabad

మన తెలంగాణ/హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీర్‌బాద్ మండల కేంద్రంలోని నవాంగి స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి ( ఆర్‌యుబి) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి టిఆర్‌ఎస్ ఎంపి జి. రంజిత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోక్‌సభలో సోమవారం 377 నిబంధన కింద ప్రత్యేకం ఆయన ప్రస్తావించారు. ఈ బ్రిడి లేక బషీర్‌బాద్ మండలంలోని 36 గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వరుస రైళ్ల రాకపోకల మార్గం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు.

మండల కేంద్రానికి వెళ్లేందుకు ఇతర మార్గాలు కూడా లేకపోవడంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మానవరహిత రైల్వే గేట్లను తొలగించి అండర్ బ్రిడ్జిలను నిర్మించాలని విజ్ఞప్తి చేశా. రైల్వే శాఖ విధాన పరమైన నిర్ణయమైన నేపథ్యంలో వెంటనే నవాంగి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను నిర్మించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News