- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురువనున్నాయి. నైరుతి ఋతుపవనాలు దేశమంతటా విస్తరించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. కోస్తాంధ్రలో సాధారణంగా, రాయలసీమలో చురుగ్గా నైరుతి ఋతుపవనాలు వీస్తున్నాయి. దీంతో ఎపిలో రానున్న మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ రాగల రెండు రోజులపాటు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్ర తెలిపింది. శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Rain Alert for 2 days in Telangana and AP
- Advertisement -