- Advertisement -
హైదరాబాద్ః తెలంగాలోని కొన్ని ల్యాబ్లల్లో రెండురోజులపాటు కరోనా టెస్టులు నిలిచిపోనున్నాయి. శనివారం, ఆదివారం కొన్ని ప్రైవేటు ల్యాబ్లల్లో కరోనా పరీక్షలు నిలిచిపోనున్నాయి. ఐసిఎమ్ఆర్ నిబంధనలు బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా ప్రవేటు ల్యాబ్లు కరోనా పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కరోనా పరీక్షలను లాభాలతో చూడొద్దని తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్లకు తెలిపింది. మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల సంఖ్య 12 వేలు దాటింది. కాగా, అధికశాతం హైదరాబాద్లోనే కరోనా కేసులు నమోదవుతుండడంతో నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నగరంలో కరోనా విజృంభిస్తుండడంతో వ్యాపార సంస్థలు వచ్చే నెల 5వ తేదీ వరకు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్నాయి.
Telangana stop Corona Tests for 2 days
- Advertisement -