- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం జంటనగరాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, బేగంపేట, నాంపల్లి, అబిడ్స్, కోఠి పరిసరాల్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.
rains in Telangana for next three days
- Advertisement -