Sunday, May 12, 2024

రాజీనామా చేస్తా.. లేఖ స్పీకర్‌కు ఇస్తా: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ సంచలన ప్రకటన

Raja singh resigned MLA post

మన తెలంగాణ/హైదరాబాద్: గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తానని ఆయన కీలక ప్రకటన చేశారు. తన ఎంఎల్‌ఎ పదవికి రాజానామా చేయమని నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని, సిఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ పేర్కొన్నారు. ఉప ఎన్నిక వస్తే ప్రభుత్వంకు బడుగులు, రైతులపై ప్రేమ వస్తుందన్నారు. అంతేకాకుండా గోషామహల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని డమాండ్ చేశారు. ఇస్తే కచ్చితంగా స్పీకర్ దగ్గరకు వెళ్లి రాజీనామా పత్రాన్ని అందజేస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News