టాలీవుడ్ లో స్టార్ హీరోయన్గా ఓ వెలుగు వెలిగి ఒక్కసారిగా డల్ అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. గత ఏడాది ఆమె కెరీర్ పరంగా చాలా ఎత్తు పల్లాలను చవి చూడాల్సి వచ్చింది. అవకాశాలు రావడమే గగనం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా రకుల్కు మూడు వరుస సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తోంది. అయితే ఈ మూడు కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్లో ఈ బ్యూటీ అర్జున్ కపూర్తో కలిసి ఒక సినిమా చేస్తోంది. షూటింగ్ దాదాపుగా పూర్తయిన ఈ సినిమాను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. అదేవిధంగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న మరో తెలుగు సినిమా కూడా ఓటీటీ ద్వారానే విడుదలయ్య అవకాశం కనిపిస్త్తోంది. అదే నితిన్తో ఆమె నటిస్తున్న ‘చెక్’ మూవీ . ఈ సినిమాలో రకుల్ సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయట.
మూడు ఓటీటీలోనే..?
- Advertisement -
- Advertisement -
- Advertisement -