కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా సినిమాల షూటింగ్ జరగడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. షూటింగ్లకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నా కూడా హీరోలు హీరోయిన్స్ మాత్రం తాము షూటింగ్లకు రామని అంటున్నారు. ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్స్ ఎవరు సినిమా షూటింగ్లకు హాజరు కాలేదు. ఈ పరిస్థితుల్లో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం నటిస్తున్న సినిమా షూటింగ్ను ముగించేందుకు సిద్ధం అవుతున్నారు. రెండు వారాల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా కరోనా వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం ముంబయిలోని ఒక స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. రెండు వారాల పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా షూటింగ్లో పాల్గొననుంది. చాలా నెలల తర్వాత రకుల్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతోంది. కరోనా కారణంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్ను మొదలు పెట్టారట. అయితే కరోనా సమయంలో షూటింగ్ అంటే చాలా పెద్ద సాహసం. సౌత్ ఇండియాకు చెందిన స్టార్ హీరోయిన్స్ లో రకుల్ మాత్రమే షూటింగ్లో పాల్గొననుంది. ఈ బ్యూటీ పెద్ద సాహసం చేయబోతోంది.
Rakul to join in bollywood film shooting after lockdown