Saturday, April 27, 2024

బంగ్లాదేశ్ సందర్శించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

- Advertisement -
- Advertisement -

Ramnath Kovind

ఢాకా: భారత రాష్ట్రపతి డిసెంబర్ 16,17 తేదీలలో బంగ్లాదేశ్ పర్యటించనున్నారు. అక్కడ ఆయన ‘విక్టరీ డే సెలబ్రేషన్స్’లో పాల్గొననున్నారని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎ.కె.అబ్దుల్ మోమెన్ తెలిపారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆహ్వానంపైనే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారని డెయిలీ స్టార్ న్యూస్‌పేపర్ ఆదివారం పేర్కొంది. భారత 14వ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్ పర్యటించడం అన్నది ఇదే మొదటిసారి.
భారత్,బంగ్లాదేశ్ వచ్చే నెలలో రెండు మెగా ఈవెంట్లయిన ‘మైత్రి దివస్, బంగ్లాదేశ్ విజయోత్సవ దినం’ వేడుకలపై పనిచేస్తున్నాయని ‘ఢాకా ట్రిబ్యూన్’ పేర్కొంది. ఆ రెండు ఈవెంట్లు డిసెంబర్ 6, 16న జరగనున్నాయి. ఈ ఈవెంట్లకు ఇరు దేశాల ప్రముఖులు పరస్పరం సందర్శించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News