Friday, April 26, 2024

ఢిల్లీ లిక్కర్ కేసు.. రామచంద్ర పిళ్లై జుడిషియల్ రిమాండ్ పొడిగింపు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రామచంద్ర పిళ్లైకి జుడిషియల్ రిమాండ్‌ను 14 రోజులపాటు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన రామచంద్ర పిళ్లైకి జుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు కొర్టు పొడిగించింది. సోమవారం బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితతోపాటు రామచంద్ర పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు.

అయితే, పిళ్లై కస్టడి ఈ రోజుతో ముగియనుండటంతో అధికారులు రౌస్ రెవెన్యూ కోర్టుకు తలించగా.. మరోసారి పిళ్లైకి కోర్టు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పిళ్లైని ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, కవిత విచారణ ఇంకా కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News