Monday, April 29, 2024

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గంజా గ్యాంగ్… కత్తులతో దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మరో సారి గంజా గ్యాంగ్ రెచ్చిపోయింది. సోహెల్ అనే రౌడీ షీటర్ పై కత్తులతో దాడి చేశారు. మోటర్ సైకిల్ పై వస్తున్న యువకుడిని అడ్డగించి కండ్లలో కారం చల్లి గ్యాంగ్ దాడికి పాల్పడింది. కత్తులతో పొడవడంతో మూడు చోట్ల కత్తి పోటు గాయాలు ఉన్నాయి. వారిని ప్రతిఘటించి యువకుడు తప్పించుకున్నాడు. బాధితుడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. హుస్సేన్ అనే వ్యక్తి తో పాటు ముగ్గురుపై ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News