- Advertisement -
వరంగల్: పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మోసం చేసిన ఎస్ఐపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు సదరు ఎస్ఐ దుర్గం మహేందర్పై కేసు నమోదు చేశారు. రెండు సంవత్సరాల క్రితం సుబేదారి పోలీస్ స్టేషన్లో మహేందర్ ఎస్ఐగా పనిచేశాడు. స్థానిక మెడికల్ షాపులో ఉన్న యువతితో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి పలుమార్లు అడిగిన కూడా అతడు పట్టించుకోకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు మహేందర్పై ఐపిసి 417,420,370 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మహేందర్ పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
- Advertisement -