Saturday, April 27, 2024

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆరోగ్యం విషమం…

- Advertisement -
- Advertisement -

Delhi Deputy CM health critical with corona

 

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కలవర పెడుతోంది. కరోనా వైరస్ ధాటికి రోజుకు వెయ్యి మందికి పైగా మరణిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్  సిసోడియాకు కరోనా వైరస్ సోకింది. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కరోనాతో పాటు డెంగ్యూ జ్వరం రావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారిందని లోక్ నాయక్ ఆస్పత్రి వర్గం వెల్లడించాయి. రక్త కణాల సంఖ్య తగ్గిపోవడంతో పాటు శరీరంలో ఆక్సిజన్ శాతం పడిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. మనీష్ ఆరోగ్య పరిస్థితి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 3834 కేసులు నమోదుకాగా 36 మంది చనిపోయారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2.60 లక్షలకు చేరుకోగా 5123 మంది మృత్యువాతపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News