- Advertisement -
మహబూబాబాద్: వరసకు చిన్నాన్న అయ్యే వ్యక్తి బాలికపై అత్యాచారం చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరోనా వైరస్ నేపథ్యంలో స్కూళ్లు మూతపడడంతో బాలిక ఇంటి దగ్గరే ఉంటుంది. అదే తండాలో నివసిస్తున్న వరసకు బాబాయి అయ్యే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఆ విషయం తన తల్లిదండ్రులకు బాలిక చెప్పలేదు. కొన్ని రోజుల తరువాత బాలిక కళ్లు తిరిగి పడిపోవడంతో మంగళవారం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భవతి అని తెలిపారు. బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో అతడిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శంకర్ రావు వెల్లడించారు.
- Advertisement -