జైపూర్: పదేళ్ల బాలికపై దాడి, అత్యాచారం చేసి బతికుండగానే పాతి పెట్టిన సంఘటన రాజస్థాన్లోని చురు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మూడో తరగతి చదువుతున్న బాలిక సోమవారం రాత్రి తొమ్మిదన్నర గంటల ప్రాంతంలో చాక్లెట్స్ కోసమని స్థానిక దుకాణానికి వెళ్లింది. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. రాత్రి 10.30 నిమిషాలకు రక్తపు మడుగులో కూతురు కనిపించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలికపై నిందితుడు అత్యాచారం చేసి అనంతరం తలపై రాయితో దాడి చేశారని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. స్థానికంగా ఉండే యువకుడు పాపకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి గ్రామ శివారులోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలిక తలపై రాయితో దాడి చేశాడు. అనంతరం బతికుండగానే ఆమెను గుంత తవ్వి పూడ్చాపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడని పోలీస్ అధికారి విష్ణు దత్ తెలిపాడు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి విచారణ చేస్తున్నారు.