Saturday, April 27, 2024

నిర్మల్‌లో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం..

- Advertisement -
- Advertisement -

నిర్మల్‌: జిల్లా పట్టణంలో ఓ వ్యక్తి కిడ్నాప్‌ కలకలం రేపింది. పట్టణంలోని తన్వి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వ్యాపారి విజయ్‌చందర్‌ దేశ్‌పాండేను కొంతమంది దుండగులు ఆదివారం ఉదయం కిడ్నాప్‌ చేశారు. దీంతో వ్యాపారి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన నలుగురు వ్యక్తులు విజయ్‌చందర్‌ను కారులో తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆదారంగా గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును చేధించారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ వద్ద విజయ్‌చందర్‌ ఉన్నట్లు ఆచూకీ లభించడంతో అక్కడికి చేరుకుని విజయ్‌చందర్‌ కాపాడారు. కిడ్నాప్‌ చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ.2కోట్ల కోసం జయ్‌చందర్‌ను కిడ్నాప్ చేసినట్లు నిందితులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

Realtor kidnapped in Nirmal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News