Thursday, May 16, 2024

మద్యం కేసులో చంద్రబాబుకు ఊరట

- Advertisement -
- Advertisement -

అమరావతి: మద్యం కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఎంపి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్‌పై ఇరుపక్షాలు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాయి. తీర్పు వచ్చేంత వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని హైకోర్టు వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News