Monday, May 6, 2024

మహారాష్ట్రలో మధ్యాహ్నం వేళ కార్యక్రమాలపై ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలో మధ్యాహ్నం వేళ 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు, సభలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ఆదివారం నాడు నవీ ముంబైలోని ఖర్ఘార్ ప్రాంతంలో మహారాష్ట్ర భూషణ్ అనే అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఎండల వేడికి తట్టుకోలేక 14 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘోర సంఘటన దృష్టా మధ్యాహ్నం పూట ఆరుబయలు స్థలాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయరాదని ఆంక్షలు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News