Friday, April 26, 2024

ఆదిలాబాద్​లో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Road accident in Adilabad: Four killed

ఆదిలాబాద్​ : ఆదిలాబాద్​ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన గుడిహత్నూర్​ మండలం సీతాగొంది దగ్గర చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు కారులో ప్రయాణిస్తున్నారు. గుడిహట్నూర్ మండలం సీతాగొంది సమీపంలో ఆదిలాబాద్ వైపు వెళుతున్న కంటైనర్‌ను వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారు లారీ వెనుక ఇరుక్కుపోయింది. మృతదేహాలను రెండు క్రేన్‌ల సాయంతో బయటకు తీశారు. మృతుల్లో డ్రైవర్ శంశు, సయ్యద్ రఫీతుల హస్మి, వజహబ్ హస్మి, సలీమా, జూబియాలు ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News