Monday, April 29, 2024

ఆగ్రాలో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో సంభవించిన ఘోర దుర్ఘటనలో సోమవారం రాత్రి అంతా ఒక శవంపై అనేక కార్లు దూసుకుపోయాయి. తుదకు ఆ రహదారిపై నుంచి శవాన్ని పోలీసులు షోవెల్‌తో తొలగించవలసి వచ్చింది. శరీర భాగాలు 500 మీటర్ల దూరం చెల్లాచెదురు అయ్యాయి. పోలీసులు అక్కడి నుంచి యథాతథంగా ఒక వేలును స్వాధీనం చేసుకోగలిగారు.

ఆ వేలిగుర్తులో మృతుని గుర్తించడానికి ఫోరెన్సిక్ బృందానికి వీలు అవుతుందని పోలీసులు ఆశిస్తున్నారు. ఆ ప్రదేశంలో కనిపించిన దిగ్భ్రాంతికరమైన విజువల్స్ ఒక పాదరక్షను కూడా చూపించాయి. అది మృతునిది అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉన్నందున వాహనదారులు ఆ మృతదేహాన్ని గుర్తించి ఉండకపోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News