Saturday, April 27, 2024

ఆటోను ఢీకొట్టిన కారు… పది మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

 

రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నపూర్ గ్రామ శివారులో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భూపాలపల్లి -పరకాల ప్రధాన రహదారిపై పరకాల వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వాహనాలను రోడ్డు పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News