Monday, April 29, 2024

బాలకృష్ణను చూస్తే జాలేస్తుంది: రోజా

- Advertisement -
- Advertisement -

MLA Roja shocking dissection on jabardasth, movie shootings

హైదరాబాద్: బాలకృష్ణను చూస్తే జాలిగా ఉందని మంత్రి రోజా చురకలంటించారు. నటుడు, టిడిపి ఎంఎల్‌ఎ బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లు గుర్తుకురాని నిమ్మకూరు ఇప్పుడు గుర్తొచ్చిందా? అని నిలదీసింది. ఎన్‌టిఆర్ స్థాపించిన టిడిపి ఎప్పుడో పోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్నది నారావారి తెలుగు దేశమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాసే స్క్రిప్ట్ చదవడం మానేసి బాలకృష్ణ ఎన్‌టిఆర్ వారసుడిగా బయటకు రావాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్ టిఆర్ శత జయంతి సందర్భంగా బాలకృష్ణ నిమ్మకూరులో పర్యటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News