Wednesday, May 1, 2024

హైదరాబాద్ కరాచీ బేకరీలో భారీ చోరీ..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కరాచీ బేకరీలో చోరీ జరిగిన సంఘటన నగరంలోని ఎంజే మార్కెట్ చౌరస్తాలో బుధవారం చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ విధించడంతో నగరంలోని అన్ని షాపులు మూసివేశారు. ఎంజే మార్కెట్ సమీపంలోని కరాచీ బేకరీని కూడా మూసివేశారు. ఇదే అదునుగా భావించిన దొంగలు వెనుక వైపు ఉన్న షట్టర్‌ను తొలగించి లోపలికి వెళ్లారు. బేకరీలోని రూ.50,000 చోరీ చేసి ఎత్తుకెళ్లారు. అయితే లాకర్‌లోని రూ.9,60,000లక్షలు సేఫ్‌గా ఉన్నాయి. దీంతో బేకరీ యజమాన్యం ఊపిరి పీల్చుకున్నాయి. అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Rs.50,000 Stolen at Karachi Bakery in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News