- Advertisement -
కర్నూలు : జిల్లాలోని రుద్రవరంలో ఆదివారం ఎస్ఐ విష్ణునారాయణ అదృశ్యమయ్యారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చాగలమర్రి వద్ద టోల్ గేట్ నుంచి ఎస్ఐ వాహనం వెళ్లినట్టు సిసి కెమెరాలో రికార్డు అయింది. ”ఇదే నా చివరి మెసేజ్ అంటూ”కర్నూల్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ గ్రూప్ లో మెసెజ్ పోస్టు చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన కనిపించకుండాపోయారు. విధుల్లో నిర్లక్ష్యం వహించాడంటూ ఎస్ఐకి ఎస్పీ హెడ్ క్వార్టర్స్ పిలిపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు ఎస్ఐ మెసెజ్ పెట్టారు. మెసెజ్ చదివే సమాయానికి తాను ఉండోచ్చు లేకపోవచ్చు అని పోస్టుచేశారు. శనివారం రాత్రి డిఎస్ పి వెళ్లి ఎస్ఐకి నచ్చజెప్పారు. తెల్లవారుజాము కల్లా విష్ణునారాయణ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Rudravaram SI Goes missing in Kurnool district
- Advertisement -