లక్నో: వివాహతేర సంబంధం వద్దని వారించినందుకు భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. కట్టుకథలు చెప్పిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కగ్రౌల్ పోలీస్ స్టేషన్ పరధి పార్మాల్ గ్రామంలో నేత్రాపాల్ సింగ్ (30) అనే వ్యక్తి 2011లో రాఖీ(28)ని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేత్రాపాల్ సింగ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. భార్య రాఖీ వాళ్ల పెళ్లి విషయాన్ని వ్యతిరేకించడంతో భార్యను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. బంధువుల ఇంట్లో పెళ్లి వేడుక నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా తమ దగ్గర ఒక లక్ష ఇరువై వేల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని తన భార్యను తుపాకీతో కాల్చి పారిపోయారని పోలీసులకు భర్త తెలిపాడు. భర్తపై పోలీసులకు అనుమానం రావడంతో తనదైన శైలిలో ప్రశ్నించగా రెండో పెళ్లి చేసుకోవడానికి భార్య నిరాకరించడంతో తన భార్యను తానే చంపానని నిజాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
Husband Killed wife for Second Marriage in Agra,shared false matter to Police, decoits attack on me and theft 1.25 lakhs and shot my wife