Friday, April 26, 2024

తీగల కుటుంబాన్ని పరామర్శించిన సబిత

- Advertisement -
- Advertisement -

Sabitha Indra reddy visit Teegala krishna reddy family

హైదరాబాద్: మాజీ శాసనస‌భ్యులు తీగల కృష్ణారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తీగల కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆదివారం కొకాపేటలో తీగల కుటుంబ సభ్యులను మంత్రి సబితా పరామర్శించారు. శ్రీనివాస్ రెడ్డి సతీమణిని ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు చేవెళ్ళ శాసన సభ్యులు కాలే యాదయ్య గారు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News