Saturday, April 27, 2024

వాంఖడేలో సచిన్ విగ్రహం

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియంలో బుధవారం సచిన్ విగ్రహాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిసిసిఐ కార్యదర్శి జైషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్‌కు సచిన్ అందించిన సేవలకు గుర్తింపుగా వాంఖడే స్టేడియంలో అతని విగ్రహాన్ని బిసిసిఐ ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News