Friday, May 10, 2024

3న ఆర్టిసి ఎండిగా సజ్జనార్ పదవీ బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

Sajjanar will take over as RTC MD on September 3rd

హైదరాబాద్: టిఎస్‌ఆర్టిసి ఎండిగా సజ్జనార్ వచ్చే నెల 3వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్లు టిఎస్‌ఆర్టిసి వర్గాలు వెల్లడించాయి. సైబరాబాద్ సిపిగా విధులు నిర్వర్తించిన సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండిగా నియమిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుమారు మూడేళ్ల విరామం తర్వాత టిఎస్‌ఆర్టిసికి పూర్తిస్థాయి ఎండిని నియమించడం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్ సిపిగా 2013 మార్చి 18న సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. సర్వీసులో తనదైన ముద్ర వేశారు. ఎన్నో సేవా కార్యక్రమాల నిర్వహణతో పాటు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

కోవిడ్ సమయంలో వలస కూలీలను ఆదుకోవడం, సొంత ప్రాంతాలకు తరలించడం కోసం చొరవ చూపారు. కోవిడ్ రోగులకు తగిన వైద్య సహాయాన్నందించేందుకు ఉచిత ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అందించడం, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. కరోనా వేళ రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోవడంతో సజ్జనార్ ఏడాది వ్యవధిలో మూడుసార్లు రక్తదానం చేసి, కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఐదు వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు అందించారు. శాఖాపరంగా పలు సంస్కరణలను చేపట్టారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా పరిపాలన కొనసాగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News