Friday, May 3, 2024

మాజీ మామగారి షోలో సమంత ‘నర్వస్’

- Advertisement -
- Advertisement -

samantha guest in meelo evaru koteeswarudu

హైదరాబాద్: ఇదివరలో హిందీ నటుడు అమితాబచ్చన్ నిర్వహించిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అనే గేమ్‌షో తెలుగు రూపమే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. అయితే ఈ షోలో సమంత రుత్ ప్రభు, నటుడు నాగచైతన్యతో విడిపోయాక తొలిసారిగా పాల్గొన్నారు. ఇదే  లేటెస్ట్ పబ్లిక్ అప్పీరెన్స్ కూడా. దీనిని తెలుగు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే షోను సమంత మాజీ మామగారు అక్కినేని నాగార్జున మూడు సీజన్లపాటు నిర్వహించారు. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించిన షోలో సమంత పాల్గొన్నప్పటికీ ఆమె కాస్త ‘నర్వస్’గానే కన్పించారు. ముందటి చలాకీతనం, హుషారుతనం కాస్త తగ్గాయనిపించింది.

జూనియర్ ఎన్టీఆర్- సమంతల ఈ స్పెషల్ ఎపిసోడ్ దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని చేశారు. ఈ ఎపిసోడ్ ప్రమో వీడియోను జెమిని టివి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌చేసింది. సమంత నర్వస్‌ను చూస్తే ‘అయ్యో’ అనిపిస్తుంది. ఎంతగా కుంగిపోయి ఉందోననిపిస్తుంది. దసరా స్పెషల్‌గా ఈ ఎపిసోడ్‌ను అక్టోబర్ 14న ప్రసారం చేయనున్నారు.
ఈ ఎపిసోడ్ షోలో జూనియర్ ఎన్టీఆర్ సమంతను ఆహ్వానిస్తాడు. అప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది.“కూర్చుంటే భయంగా ఉంది’ అని సమంత అంటే, ‘ఉంటుంది. ఇది హోస్ట్ సీటు…అది హాట్ సీటు’ అని జూనియర్ ఎన్టీఆర్ రిటార్డ్ ఇస్తాడు. “సాధారణంగా ఎవరైనా వేయి నుంచి కోటికి వెళ్తారు…నువ్వు కోటి నుంచి వేయికి వస్తే ఆట బాగుంటుంది కదా” అని ఎన్టీఆర్ అనగా ఆమె నవ్వలేక నవ్వేస్తుంది. ఆ తరువాత ‘వదిలేయనా డబ్బు’ అంటుంది. దానికి జూనియర్ ఎన్టీఆర్ ‘అయితే క్విట్ అయిపోతావా?’ అంటాడు. దానికి ఆమె ‘మీరు ఇప్పుడు చెబుతున్నారు. ముందే చెప్పాలి కదా’అని భేలగా అంటుంది.

ఆమె ఇంకా మానసిక ఒత్తిడిలోనే ఉండి ఈ షోలో పాల్గొన్నట్లు ఆమె హావభావాలు కనిపిస్తుంటాయి. ఆమెలోని మునుపటి చలాకీతనం, హుషారుతనం అంతగా కనిపించలేదనే చెప్పాలి. అయినా ఆమె సమయస్ఫూర్తి జవాబులు, ఆలోచించి చెప్పినవి ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రమో వీడియో యూట్యూబ్‌లో కూడా కనిపిస్తుంది. అయితే ఫుల్ వర్షన్ మాత్రం అక్టోబర్ 14న ప్రసారమైనప్పుడే చూడగలం. ‘వెయిట్ అన్టిల్.. దెన్ ఎంజాయ్!’

(జెమినీ టివి సౌజన్యంతో…)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News