Monday, April 29, 2024

పాము పగ…. నెలలో ఎనిమిది సార్లు కాటేసింది….

- Advertisement -
- Advertisement -

Same Snake 8 Times in One Month

 

లక్నో: నెల వ్యవధిలో ఓ యువకుడిని పాము ఎనిమిది సార్లు కాటేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. పాము బారి నుంచి  తప్పించుకోవడానికి స్థలాలు మార్పిడి చేసినా.. పగబట్టి యువకుడిని కాటేసిందని అతడి బంధువులు తెలిపారు. బస్తీ జిల్లాలోని రామ్ పూర్ గ్రామంలో యశ్ రాజ్ మిశ్రా అనే యువకుడు ఉన్నాడు. నెల రోజుల క్రితం పాము కాటేయడంతో స్థానిక ఆస్పత్రి లో చికిత్స తీసుకున్నాడు. రెండో సారి కాటు వేయడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడంతో పాటు పూజలు చేయించుకున్నాడు. రామ్ పూర్ లో ఉంటే పాము కరుస్తుందనే భయంతో తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అప్పుడు కూడా పాము కాటు వేయడంతో గజగజ వణికిపోయాడు. అలా ఎనిమిది సార్లు స్థలాలు మారిన కూడా అదే పాము కాటు వేసిందని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాములను పట్టేవాళ్లు పలుమార్లు ప్రయత్నించిన పాము దొరకలేదని స్థానికులు తెలిపారు. పాము భయంతో తన కుమారుడు మానసికంగా కుంగిపోయాడని తండి చంద్ర మౌళి మిశ్రా వాపోతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News