- Advertisement -
హైదరాబాద్: ఐదు రూపాయల భోజన కేంద్రాలన్నీ పని చేసేలా చూడాలని సిబ్బందికి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సూచించారు. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. కరోనా నిర్మూలించేందుకు పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రహదారుల మరమ్మతులు వేగవంతం చేయాలన్నారు. ఆవాసం లేని వారిని రాత్రి షెల్టర్లకు తరలించాలన్నారు. కరోనా నిర్మూలించే వరకు స్వీయ నిర్బంధన పాటించాలన్నారు. వైద్యులు సలహాలు, సూచనలు ప్రజలు తప్పక పాటించాలని కెటిఆర్ కోరారు.
Sanitation program is important says KTR
- Advertisement -