Friday, April 26, 2024

కొంపల్లిలో రోడ్డు ప్రమాదం.. పారిశుధ్య కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

Accident

 

మేడ్చల్: పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జిల్లా జాతీయ రహదారి, కొంపల్లి మున్సిపాలిటీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడు సిద్ది రాములు మృతి చెందాడు. కొంపల్లి రహదారిపై ఆదివారం ఉదయం తన విధులను నిర్వహిస్తున్న చిన్న శంకరంపేట్ చెందిన సఫాయి కార్మికుడు సిద్ది రాములును గుర్తతెలియని ఓ వాహనం ఢీ కొట్టింది. దీంతీ రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికుల 108 సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Sanitation Worker dies in Road Accident in Kompally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News