Saturday, April 27, 2024

సంజయ్.. బాగా కష్టపడ్డారు : మోడీ

- Advertisement -
- Advertisement -
తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురండి

హైదరాబాద్ : తెలంగాణలో బిజెపి బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్‌ను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. గురువారం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని సంజయ్‌ను అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతోపాటు వారి యోగ క్షేమాలను మోడీ అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News