Monday, April 29, 2024

ఎన్‌ఆర్‌ఐ భర్తల మోసాలపై సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

SC agrees to hear pleas against NRI men who duped Indian women

 

న్యూఢిల్లీ : తమను పెళ్లి చేసుకుని మోసగించిన ఎన్‌ఆర్‌ఐలపై విచారణ కోరుతూ 8 మంది మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌పై జులైలో తుది విచారణ చేపడతామని సుప్రీం కోర్టు సోమవారం ప్రకటించింది. పెళ్లి చేసుకుని విడిచిపెట్టిన ఎన్‌ఆర్‌ఐలపై చర్యలు తీసుకుని తమ హక్కులను పరిరక్షించాలని మహిళలు 2018 లో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. విదేశాల్లో భర్తలపై చేసే న్యాయపోరాటానికి దౌత్యసాయం అందించాలని కోరారు. ఈ పిటిషన్లపై గతం లోనే విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ ఎన్‌ఆర్‌ఐల పెళ్లి మోసాలపై ప్రవాసి లీగల్ సెల్ మరో పిటిషన్ దాఖలు చేసింది. తాజా పిటిషన్‌పై కేంద్రానికి మరోసారి నోటీసులు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News