Tuesday, April 30, 2024

గల్లంతైన పైలట్ కోసం కొనసాగుతున్న గాలింపు

- Advertisement -
- Advertisement -

Searching continues for pilot Nishant Singh

 

ముంబయి: అరేబియా సముద్రంలో గురువారం సాయంత్రం కూలిపోయిన మిగ్-29కె యుద్ధ విమానం సంఘటనలో గల్లంతైన పైలట్ నిషాంత్ సింగ్ కోసం గాలింపు కొనసాగుతోందని పశ్చిమ నౌకాదళ కమాండ్ అధికార ప్రతినిధి శనివారం తెలిపారు. గల్లంతైన పైలట్ నిషాంత్ సింగ్ కోసం నౌకల ద్వారా, విమానాల ద్వారా గాలింపు కొనసాగుతోందని ప్రతినిధి చెప్పారు. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నుంచి బయద్దేరిన మిగ్ విమానం అరేబియా సముద్రంలో కూలిపోగా అందులోని ఒక పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. మరో పైలట్ గల్లంతవ్వడంతో ఆయన కోసం నౌకాదళం గాలింపు చర్యలు చేపట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News