Friday, April 26, 2024

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈడీకి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయని, ఈడీ అధికారాలు అపరిమితమేమే కాదని కోర్టు గుర్తు చేసింది. మనీలాండరింగ్ కేసులను మాత్రమే ఈడీ విచారించాలని వ్యాఖ్యానించింది.

ప్రతిదాంట్లో ఈడీ జోక్యం తగదని, ఛత్తీస్‌గఢ్ లోని కోల్‌బ్లాక్‌ల కేటాయింపులకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించడం హాట్ టాపిక్‌గా మారింది. సెక్షన్ 3 నేరాలను మాత్రమే పరిశోధించడానికి పిఎంఎల్ ఈడీకి అధికారం ఇచ్చిందని, ప్రతి దాంట్లో ఈడీ జోక్యం తగదని హితవు పలికింది. విచారణ సందర్భంగా వేరే నేరాలు వెలుగు లోకి వస్తే వాటిని సంబంధిత ఏజెన్సీలు మాత్రమే విచారించాలని డిల్లీ హైకోర్టు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News