- Advertisement -
అమరావతి: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కురిచేడులో శానిటైజర్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డారు. మద్యం దుకాణాలు లేకపోవడంతో యాచకులు, స్థానికులు శానిటైజర్ తాగారు. నిన్న అర్ధరాత్రి ముగ్గురు మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అనుగొండ శ్రీను(25), భోగేమ్ తిరుపతయ్య(37), గుంటక రామిరెడ్డి(60), కడియం రమణయ్య(30), రమణయ్య(65),రాజారెడ్డి(65)తో పాటు మరొకరు ప్రాణాలు విడిచారని అధికారులు వెల్లడించారు.
Seven died after drinking sanitizer in Prakasam district
- Advertisement -