Monday, April 29, 2024

తిరుమల శ్రీవారి సేవలో షారుఖ్ ఖాన్

- Advertisement -
- Advertisement -

తిరుపతి : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. 58 ఏళ్ల షారుఖ్ తన కుమార్తె సుహానాఖాన్, భార్య గౌరీఖాన్, నయనతార. ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. తెల్లని కుర్తా పైజామా తో సంప్రదాయ దుస్తుల్లో షారుఖ్ కనిపించారు. ధ్వజస్థంభానికి ప్రమాణం చేసిన తరువాత స్వామివారిని దర్శించుకున్నారు. షారుఖ్‌కు తిరుమల దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 7న షారుఖ్ నటించిన ‘జవాన్ ’ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News