Monday, April 29, 2024

మనిషి కాలిని కొరికిన షార్క్

- Advertisement -
- Advertisement -

ఆసుపత్రికి తరలింపు
స్థానికుల నిర్బంధంలో చనిపోయిన షార్క్
మహారాష్ట్రలో ఘటన

పాల్ఘర్ : మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన 32 ఏళ్ల వ్యక్తి షార్క్ ధాటికి గాయపడ్డాడు. షార్క్ అతని ఎడమ కాలు ఊడి వచ్చేట్లుగా కొరికింది. అతను ఆ ప్రాణాంతక దాడి నుంచి బయటపడి,ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ ఆ 200 కిలోల షార్క్ చనిపోయింది.

ఒక నదికి అనుబంధంగా ఉన్న నీటి కయ్యలో పలువురు చేపల వేటకు వెళ్లారు. వారిలో ఒకడైన విక్కీ సేకేష్ గోవారిపై షార్క్ అకస్మాత్తుగా దాడి చేసింది. ఫలితంగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దాడి తరువాత విక్కీని చికిత్స నిమిత్తం ఒక ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు ఆ షార్క్‌ను నిర్బంధించగలిగారు. కాని అది ఆ తరువాత చనిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News