Tuesday, April 30, 2024

‘నాకు వినిపించదు… కానీ మాట్లాడతాను’: శ్రియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుజనా రావు దర్శకత్వంలో శ్రియా శరణ్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గమనం’. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా శరణ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తాను. నాకు వినిపించదు… కానీ మాట్లాడతాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర. ఊహకందని ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్మే పాత్రలో కనిపిస్తాను. మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ, ప్రయాణం గురించి చెప్పేదే ‘గమనం’. నేను ఇందులో ఒక రూంలోనే ఉంటాను. దాన్నుంచి బయటకు రావడమే నా విజయం. ఈ పాత్రను పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గమనం సినిమాలో మూడు కథలు ఒకే టైమ్‌లో సాగుతాయి. ప్రతీ స్టోరీ ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఈ సినిమాలోని కమల పాత్ర కోసం బట్టలు కుట్టడం నేర్చుకున్నాను”అని అన్నారు.

Shriya Saran about Gamanam Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News