Monday, April 29, 2024

తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై ప్రమాదం.. యువతి, యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

2 Died in Road Accident in Visakhapatnam

విశాఖపట్నం: నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం నగరంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై ఓ బైక్ అతివేగంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న యువతి, యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవారిని ప్రశాంత్(22), రాధిక(17)లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

2 Died in Road Accident in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News