Wednesday, May 1, 2024

దిల్ రాజు చెప్పినట్టే జరుగుతోంది

- Advertisement -
- Advertisement -

Shyam Singha Roy press meet

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ “గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇండస్ట్రీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు అని అనుకుంటున్న తరుణంలో అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలు నైజాంలో విడుల చేస్తే మూడు సూపర్ హిట్ అయ్యాయి.

డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా ఇలాంటి మ్యాజిక్‌ను చూసినప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది”అని అన్నారు. నాని మాట్లాడుతూ “సినిమా బాగుంది అని ఒకటి, రెండు లైన్లలో చెప్పడం లేదు. లవ్ లెటర్‌లా రాస్తున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్ అనిపిస్తోంది. దిల్ రాజు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని విడుదలకు ముందు రోజే చూశారు. థియేటర్లో ఎలాంటి స్పందన వస్తుందో చెప్పారు. ఆయన చెప్పినట్టే జరుగుతోంది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ మాకు ఇంత సాయం చేసినందుకు ఆయనకు థ్యాంక్స్. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఈ నెల అంతా బాగుంది. అన్ని పరిస్థితులు చక్కబడి ఈ ఊపు ఏదైతే ఉందో వచ్చే ఏడాది.. ఇంకా పదేళ్లు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ సంకృత్యాన్, వెంకట్ బోయనపల్లి, సాయి పల్లవి, కృతి శెట్టి, ఆర్. నారాయణ మూర్తి, అవినాష్ కొల్ల, సత్యదేవ్ జంగా, అభినవ్ గోమఠం తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News