Friday, April 26, 2024

సిద్దిపేట దశ, దిశ మారింది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట:  తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంగా ఏర్పడడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించడంతో సిద్దిపేట దశ, దిశ మారిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట శివారు నాగులబండ వద్ద రూ.19 కోట్ల 44 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన హరిత త్రీ స్టార్ టూరిజం హోటల్ ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఉత్తర తెలంగాణ నుంచి రాక పొకలు సాగించే వారికి ఉపయోగపడేలా రెస్టారెంట్ ఉపయోగ పడుతుందని, సిద్దిపేట ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు చేయనున్నారని, కంటి చూపుతో బాధపడుతున్న పేద ప్రజలను గుర్తించి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి కంటి సమస్యలను తొలగిస్తుందన్నారు.

టూరిజం హోటల్ ప్రక్కనే వందలాది మందికి ఉపాధి నిచ్చే ఐటి టవర్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, టూరిజం హోటల్ ముందు ఆక్సిజన్ పార్క్ 200 ఎకరాలలో విస్తరించి ఉందని, విద్య, వైద్యం రంగాలలో మౌలిక సదుపాయాలు పెంపొందిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. హన్మకొండ – సిద్దిపేట, జనగామ – చేర్యాల – సిద్దిపేట,
దుద్దేడ – సిరిసిల్ల వరకు జాతీయ రహదారులుగా ఏర్పాటు చేసుకున్నామని, ప్రజా అవసరాలు ఒక్కొక్కటిగా తీర్చుతున్నామని, అన్ని రంగాలలో గుణాత్మక మార్పులు సాధిస్తూ రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలుస్తున్నామని హరీష్ రావు ప్రశంసించారు. సిఎం కెసిఆర్ సిద్దిపేట జిల్లా ప్రాతినిధ్యం వహించడం, వారి ఆశీస్సులు ఉండడం, ప్రజల ఆకాంక్షల మేరకు వారి భాగస్వామ్యంతో నాడు రాష్ట్రం కోసం నేడు అభివృద్ధికి ఉద్యమిస్తున్నామని, సిద్దిపేట జిల్లాకు 33 జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులను సొంతం చేసుకున్నామని ప్రశంసించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దుద్దేడను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.

రూ.100 కోట్లతో రంగనాయక సాగర్ ను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నామని  ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. స్వరాష్ట్రం తెలంగాణలో సిద్దిపేట టూరిజం స్పాట్ గా మారిందని, మౌలిక సదుపాయాల అభివృద్ధితో భవిష్యత్తులో స్థిర నివాస కేంద్రంగా సిద్దిపేట అవతరించిందని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News