- Advertisement -
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఎతవాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రైతుల ప్రాణాలను బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మినీ ట్రక్కులో పనస పండ్లు అమ్ముడానికి రైతులు మార్కెట్ కు వెళ్తుండగా మరో ట్రక్కు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడు సైఫాయ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక ఎస్పి ఆర్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
- Advertisement -